కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2021-12-08 07:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్ రైతులను టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. రైతులు ధాన్యాన్ని తగలబెడుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఢిల్లీలో డ్రామాలు...
కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుండటంతో ఇక్కడ రైతులు గుండెలు ఆగిపోతున్నాయని వైఎస్ షర్మిల మండి పడ్డారు. ఇంకెంత మంది చస్తే కేసీఆర్ కళ్లు తెరుస్తారో? అని షర్మిల ఫైర్ అయ్యారు. యాసంగి లో పొలాల్లో ఉండాల్సిన రైతులను పాడె ఎక్కిస్తున్నాడని కేసీఆర్ పై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.


Tags:    

Similar News