హరీశ్ రావు మరోసారి హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-04-17 13:01 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏపీ ప్రజల్ని తిట్టింది లేదని, అయినా కొంత మంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. తాను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానని అన్న హరీశ్ రావు చేతనైతే ఏపీకి హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడండి అని హరీశ్ రావు మరోసారి వ్యాఖ్యానించారు. సిద్ధిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజలను అనలేదే...
ప్రత్యేక హోదా ఇస్తామని విస్మరించిన వారిని వదిలిపెట్టి దాని గురించి ప్రశ్నించిన తమ వంటి వారిపై ఎందుకు కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ ప్రజలకు వివరిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల విద్యుత్తును మాత్రమే అందిస్తున్నారని, తెలంగాణలో మాత్రం 24 గంటలు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా ఇస్తున్నామని గుర్తు చేశారు.


Tags:    

Similar News