నేడు కేసీఆర్ ముఖ్య సమావేశం.. అందుకేనట

జాతీయ పార్టీ ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు

Update: 2022-10-02 02:52 GMT

జాతీయ పార్టీ ప్రకటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. దసరా రోజున పార్టీ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నెల 5వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడంతో అంతకంటే ముందు ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

సమన్వయకర్తలుగా...
జాతీయ పార్టీ ప్రకటన చేసిన అనంతరం ఏ ఏ రాష్ట్రాలలో పర్యటించాల్సిందీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకుంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక సమన్వయకర్తను నియమించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమావేశం జరగనుందని తెలిసింది. కొందరు ముఖ్యనేతలను ఇతర రాష్ట్రాలకు సమన్వయ కర్తలుగా నియమిస్తారని చెబుతున్నారు. వారు ఆ రాష్ట్రంలోనే ఉండి పార్టీ కార్యాలయంతో పాటు ఆ రాష్ట్ర నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News