Telangana : నూతన సంవత్సరం వేళ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది

Update: 2025-12-31 04:41 GMT

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సమాజంలో వారు కూడా యాచించకుండా సొంత కాళ్లపై నిలబడే విధంగా వారి జీవనపరిస్థితులు మెరుగయ్యేందుకు అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్‌జెండర్లకు వంద శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

75 వేలు ఉచితంగా...
ఈ పథకం కింద ఎంపికయిన వారికి తెలంగాణ ప్రభుత్వం డెబ్భయి ఐదు వేల రూపాయలను రుణాన్ని అందచేయనున్నారు. వీరు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా . ఏదైనా వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపిక కావాలంటే వారికి 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండాలి. అర్హత కలిగిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా అమలు...
తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒక్క హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. లేదా www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హులైన ట్రాన్స్ జెండర్లు జనవ 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మరిన్ని వివరాల కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.


Tags:    

Similar News