ఏప్రిల్ 8న ప్రధాని హైదరాబాద్ కు రాక

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 8వ తేదీన హైదరాబాద్ రానున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది

Update: 2023-03-26 02:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 8వ తేదీన హైదరాబాద్ రానున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గతంలోనే హైదరాబాద్‌లో మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారయినట్లు తెలిసింది.

బహిరంగ సభలో...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరుణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య కొత్త వందేభారత్ రైలును ప్రారంభించనున్నాను. జింఖానా గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News