వైఎస్ షర్మిలకు ప్రధాని ఫోన్

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పలుకరించారు

Update: 2022-12-06 06:26 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పలుకరించారు. పది నిమిషాల పాటు ఫోన్ లో ప్రధాని మోదీ షర్మిలతో మాట్లాడారు. ఇటవల జరిగిన ఘటన, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై షర్మిలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. తనకు ఫోన్ చేసినందుకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్రమ అరెస్ట్ పై...
ఎంతోమంది తన అరెస్ట్ పట్ల స్పందించారని, మోదీ కూడా ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారని షర్మిల తెలిపారు. ఇటీవల తన వాహనాన్ని దగ్దం చేశారని షర్మిల ప్రగతి భవన్ కు వెళుతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కారులో ఉండగానే తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోన్ చేయడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు.


Tags:    

Similar News