ప్రధాని పక్కన రేవంత్.. ఒక్కరికే చోటు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే వేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఒక్కరే అవకాశం కల్పించారు

Update: 2023-04-08 04:45 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే వేదికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఒక్కరే అవకాశం కల్పించారు. మిగిలిన ఎవరికీ వేదికపై సీటు లేదు. చోటు లేదు. ప్రొటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రధాని మోదీ పక్కన కూర్చుంటారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు ప్రారంభించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ వేదికపై నుంచి కొన్ని అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

ప్రొటోకాల్ ప్రకారం...
అయితే వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్, మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇది ప్రొటోకాల్ ప్రకారం అధికారులు తీసుకున్న నిర్ణయం. బీజేపీ నేతలకు వేదికపై ఎలాంటి అవకాశం ఉండదు. కేవలం కేంద్రమంత్రులకే వేదికపైకి అనుమతిస్తారు. కేసీఆర్ ఎటూ ప్రధాని సభకు రానని డిసైడ్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఒక్కరికే ప్రధాని పక్కన చోటు కల్పించారు. ప్రధాని ఎదుట రాజకీయ ప్రసంగాలు ఏదైనా జరుగుతాయా? అన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News