Congress : ముగిసిన సీఎల్పీ భేటీ... ఏకవాక్య తీర్మానం

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది

Update: 2023-12-04 07:35 GMT

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. అయితే ఈ సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని దానిపై చర్చ జరగలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు తీసుకోలేదని తెలిసింది.

అందరికీ ధన్యవాదాలు...
పార్టీకి కష్టపడిన వారినే ముఖ్యమంత్రి ఎంపిక చేయాలన్న ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవుతుంది. సీఎం ఎంపికను హైకమాండ్ కు అప్పగిస్తే ఆ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పేర్కొంది. తీర్మానాన్ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సమావేశంలో పార్టీ గెలుపు కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News