దొరా.. ప్రజలను బతకనివ్వరా

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. నిన్న కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన

Update: 2023-05-28 12:19 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. నిన్న కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదని.. తెలంగాణలో అని అన్నారు. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు.. తాలిబన్ల పాలన అంటూ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాదని, తాలిబన్లకు అధ్యక్షుడని అన్నారు. రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతే లేకుండా పోతోందని మండిపడ్డారు. ప్రశ్నిస్నే కేసులు, అరెస్ట్‌లు, జైల్లో పెట్టి చావ బాదడాలు ఇవే జరుగుతున్నాయన్నారు. పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు అదుపులో లేవని, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలను బతకనివ్వరని, ప్రతిపక్షాలను ఉండనివ్వరన్న షర్మిల.. దొర నియంత పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేశారు.

''ఢిల్లీ హక్కుల కోసం గల్లీ కేసీఆర్ ఉద్యమం చేస్తాడట. కేంద్రం మెడలు వంచుతడట. పార్లమెంట్ లో బిల్లును ఓడగొట్టేలా ఉద్యమిస్తడట'' అంటూ కేసీఆర్‌ను షర్మిల ఎద్దేవా చేశారు. ''అయ్యా దొర గారు..పక్క రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమాలు చేసే మీరు.. స్వరాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క ఉద్యమమైనా చేసిండ్రా.. కనీసం పార్లమెంట్ లో నైనా కొట్లాడిండ్రా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఒక్కనాడైనా మాట్లాడావా? కాజీపేట రైల్వే కోచ్ ఎందుకివ్వరు అని ఉద్యమించినవా..? గిరిజన యూనివర్సిటీ పై ఏనాడైనా ప్రశ్నించినవా..? బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ బిడ్డల కోసం ఏ రోజైనా నోరు విప్పినవా? ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఏనాడైనా పార్లమెంట్ ను స్తంభింపజేసినవా..? అసెంబ్లీ తీర్మానించిన మైనారిటీ,గిరిజన రిజర్వేషన్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారని అడిగినవా..? ఢిల్లీ ప్రజల తరుపున మద్దతు కోసం వచ్చిన కేజ్రీవాల్ లెక్క మీరు ఎవరినైనా కలిశారా..?'' అంటూ సీఎం కేసీఆర్‌కు షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.

మూడో కూటమి,ఫెడరల్ కూటమి అంటూ ప్రజల సొమ్ముతో రాజకీయం కేసీఆర్‌ రాజకీయ చేశారు తప్ప.. రాష్ట్ర ప్రయోజనం కోసం ఏనాడు మద్దతు అడిగింది లేదు.. ఉభయ సభల్లో ఉద్యమించింది లేదన్నారు. నిధులు ఇస్తలేరు అని ప్రగతి భవన్ ల దొంగ ఏడుపులు తప్పా.. స్వయంగా ప్రధాని నే రాష్ట్రానికొస్తే ఎదుటపడి అడిగింది లేదన్నారు. కేసీఅర్ మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడీ గడప దాటయ్ అనే దానికి ఇదే నిదర్శనమన్నారు. సుప్రీం కోర్టు తీర్పునే లెక్క చేయరా అంటూ దొంగ మాటలు చెప్పే దొర గారు.. రాష్ట్రంలో జర్నలిస్టుల స్థలాల కోసం ఇచ్చిన సుప్రీం తీర్పును మీరెక్కడ లెక్క చేశారో సమాధానం చెప్పాలన్నారు షర్మిల.

Tags:    

Similar News