టీఆర్ఎస్ కు షాక్... కీలక నేత జంప్

హైదరాబాద్ లో టీఆర్ఎస్ కి షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు

Update: 2022-06-18 05:29 GMT

హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగిలింది. దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయవారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమె ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. తనకు కీలక పదవి దక్కుతుందని భావించారు. కానీ టీఆర్ఎస్ లో తనకు ఎలాంటి న్యాయం జరగదని భావించిన విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డితో కలసి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు.

రేవంత్ తో చర్చలు..
ఈ మేరకు రేవంత్ రెడ్డిని పీజేఆర్ కూతురు విజయారెడ్డి వెళ్లి ఆయనతో చర్చించారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశరు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోనే తగిన న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్లు తెలిసింది. దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ తో ప్రయాణించడానికి సిద్ధమయినట్లు ఆమె చెబుతున్నారు. టీఆర్ఎస్ లో పరిస్థితులు బాగా లేవన్నారు. పీజేఆర్ కూతురుగా తాను టీఆర్ఎస్ లో ఉండలేకపోతున్నానని ఆమె చెప్పారు. త్వరలోనే ముహూర్తం చూసుకుని విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.


Tags:    

Similar News