నేడు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్

భారతీయ జనతా పార్టీ నేడు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చింది

Update: 2023-05-11 06:16 GMT

భారతీయ జనతా పార్టీ నేడు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇప్పటికే సంగారెడ్డికి బీజేపీ యువమోర్చా నేతలతో పాటు ఏబీవీపీ నేతలు కూడా చేరుకున్నారు.

ర్యాలీలో యువత...
సంగారెడ్డి ఐబీ గెస్ట్‌ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్‌ రోడ్స్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. అధిక సంఖ్యలో బీజేపీ నేతలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఈ నిరుద్యోగ మార్చ్‌కు తరలిరావాలని బండి సంజయ్ పిలుపు నివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News