పంజాబ్ కింగ్స్.. రిపీట్ స్టోరీ

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. కగిసో రబడ ధాటికి

Update: 2022-04-30 04:03 GMT

ముంబై : పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లోనూ పేలవమైన ఆట తీరును కనబరుస్తూ వస్తోంది. తాజాగా మరో ఓటమిని ఎదుర్కొంది. బలమైన బ్యాటింగ్ లైన్ కలిగి ఉన్న పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 133 పరుగులు మాత్రమే చేయడంతో.. 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్ రేసులను మరింత సంక్లిష్టం చేసుకుంటూ వస్తోంది పంజాబ్ కింగ్స్. తొలుత పంజాబ్ బౌలర్లు రాణించి 153 పరుగులకే లక్నోను కట్టడిచేశారు. పంజాబ్ బ్యాటర్లు మాత్రం విజయం కోసం పోరాడలేదు. బెయిర్‌స్టో చేసిన 32 పరుగులే జట్టులో వ్యక్తిగత అత్యధిక స్కోరు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 25, రిషి ధావన్ 21, లియామ్ లివింగ్ స్టోన్ 18 పరుగులు చేశారు. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, దుష్మంత చమీర, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. కగిసో రబడ ధాటికి లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్ (46), దీపక్ హుడా (34) రాణించారు. చివర్లో చమీర 17, మోసిన్ ఖాన్ 13 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. పంజాబ్ బౌలర్లలో రబడ 4 వికెట్లను తీశాడు. రాహుల్ చాహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఎల్‌ఎస్‌జీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో లక్నో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. పంజాబ్ ఐదు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది.


Tags:    

Similar News