వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంది ఎవరంటే..?

Update: 2022-06-13 12:06 GMT

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం భారీ పోటీ సాగింది. ముంబై వేదికగా బీసీసీఐ నిర్వహించిన ఈ-వేలంలో ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, స్టార్, సోనీ తదితర దిగ్గజ కంపెనీలు పోటీపడ్డాయి. చివరకు ఈ హక్కులను అక్షరాలా 44,075 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్యాకేజ్ ఏలో టీవీ హక్కులు, ప్యాకేజ్ బీలో డిజిటల్ హక్కులను బీసీసీఐ అమ్మకానికి పెట్టింది. వీటిలో ప్యాకేజ్ ఏ.. టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ రూ.23, 575 కోట్లకు దక్కించుకోగా.. భారత్ లో డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ రెండు హక్కులకు కలిపి ఏకంగా 44, 075 కోట్ల రూపాయలు బీసీసీఐకు దక్కాయి. 2023 నుంచి 2027 వరకు మొత్తం ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ఈ వేలంలో రెండు ప్యాకేజీలకు కలిపి బేస్ ధరను 33,340 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది.దాదాపు పదివేల కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది. ఇంత ధర పలకడంతో ఐపీఎల్‌ వచ్చే సీజన్‌లో ప్రతి మ్యాచ్ విలువ రూ.107.5 కోట్లకు చేరింది.

ఈ బిడ్డింగ్‌లో డిస్నీ స్టార్, సోనీ నెట్‌వర్క్‌, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ వంటి దిగ్గజ కార్ప్‌రేట్‌ కంపెనీలు పోటీ పడ్డాయి.టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. బిడ్డింగ్‌లో టీవీ ప్రసార హక్కులు ఒక్కో మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు, డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ గరిష్టంగా రూ.50 కోట్లకు అమ్ముడు పోయాయి.


Tags:    

Similar News