ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్.. ఆయన రచనలు ఎంతో స్పెషల్

మ‌నం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయ‌నే ర‌చించారు. ‘వందేమాత‌రం’ గేయాన్ని 1896లో జ‌రిగిన కాంగ్రెస్ స‌ద‌స్సులో తొలిసారిగా ఆల‌పించారు.

Update: 2022-08-12 02:06 GMT

స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేబేంద్రనాథ్ ఠాగూర్, శారదా దేవి దంపతులకు పదమూడు మంది సంతానంలో చిన్నవాడైన రవీంద్ర నాథ్ ఠాగూర్ 1861 మే 7న జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాథ‌మిక విద్య‌ మొత్తం ఇంట్లోనే.. కానీ సాహిత్య ప్రతిభ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తన రచనలతో తక్కువ కాలంలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఆయ‌న క‌విత్వంలో అధిక ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చారు. రవీంద్రనాథ్ రాసిన కవితా సంకలనం గీతాంజలి 1910లో ప‌బ్లిష్ అయ్యింది. ఇది సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఠాగూర్ అనేక ఇతర ముఖ్యమైన రచనల్లో మానసి (1890), సోనార్ తారి (1894), గితిమాలయ (1914), రాజా (1910), పోస్టాఫీసు (1912) మొదలైనవి ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నో చిత్రాలను గీశారు. ఆయ‌న‌కు సంగీతంపై ఆసక్తి ఉండడంతో కొన్ని పాటలు రాసి వాటికి సంగీతం కూడా అందించారు. జాతీయ స్వాతంత్య్రోద్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్ బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా అత‌డికి బ్రిటీష్ అధికారులు ఇచ్చిన 'నైట్‌హుడ్' బిరుదును కూడా తిరిగి ఇచ్చేశారు. జాతీయ భావాలు అధికంగా ఉన్న ర‌వీంద్రుడు అనేక హిందూ మేళాలో దేశ భ‌క్తి గీతాల‌ను పాడేవారు. త‌న పాటల ద్వారా ప్రజల్లో చైత‌న్యాన్ని త‌ట్టిలేపేవారు. బ్రిటీష‌ర్లు బాల గంగాధ‌ర్ తిల‌క్ ను బంధించిన‌ప్పుడు తీవ్రంగా వ్య‌తిరేకించారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమ‌ర్శించారు. బెంగాల్ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించారు.

మ‌నం జాతీయ గీతంగా పిలుచుకునే 'జనగణమణ'ను ఆయ‌నే ర‌చించారు. 'వందేమాత‌రం' గేయాన్ని 1896లో జ‌రిగిన కాంగ్రెస్ స‌ద‌స్సులో తొలిసారిగా ఆల‌పించారు. దీనిని బక్రించంద్ర చ‌ట‌ర్జీ ర‌చించారు. స్వాతంత్య్ర అనంత‌రం ఈ రెండింటిలో దేనిని జాతీయ గీతంగా ప్ర‌క‌టించాల‌ని పెద్ద చ‌ర్చ జ‌రిగింది. కానీ 1950 సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24వ తేదీన 'జనగణమణ'ను జాతీయ గీతంగా ప్రకటించారు. 1913 సంవత్సరంలో రవీంద్ర నాథ్ ఠాగూర్ తన కవితా రచన 'గీతాంజలి'కి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయుడు, అలాగే మొదటి యూరోపియనేతరుడు కూడా ఆయ‌నే. రవీంద్రనాథ్ ఠాగూర్ పిల్లల కోసం శాంతినికేతన్ అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీనిని విశ్వభారతి విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ప్రాచీన గురుకుల విద్యను అందించేవారు.
భారత జాతీయ గీతం - జన గణ మన, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. బ్రిటీష్ రాజ్‌లో జార్జ్ V ప్రశంసలతో జాతీయ గీతాన్ని కంపోజ్ చేశారానే ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ జాతీయ గీతం 'అమర్ సోనార్ బంగ్లా' కూడా ఆయన స్వరకల్పన చేసిందే. శ్రీలంక జాతీయ గీతం 'శ్రీలంక మాత' కూడా ఠాగూర్ సృష్టి నుండి ప్రేరణ పొందింది. దీన్ని రచించిన ఆనంద్ సమర్కూన్ రవీంద్రనాథ్ ఠాగూర్‌తో శాంతినికేతన్‌లో నివసించారు. ఆనంద్ సమర్కూన్ ఒకసారి మాట్లాడుతూ ఠాగూర్ స్కూల్ ఆఫ్ కవిత్వం తనని బాగా ప్రభావితం చేసిందని చెప్పారు. ఠాగూర్ కవిత్వం సంగ్రహావలోకనం అందులోని ఒక పేరాలో కనిపిస్తుంది.


Tags:    

Similar News