ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2023-08-14 07:30 GMT

"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" ఉత్సవాల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. బర్కత్ పురా బీజేపీ కార్యాలయంలో ర్యాలీని ప్రారంభించిన ఆయ‌న‌.. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. బర్కత్ పురా బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి నారాయణ గూడ వీర్ సావర్కర్ విగ్రహం వరకు ర్యాలీ జ‌రిగింది.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "ఆజాధి కా అమృత్ మహోత్సవ్‌" కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర దినోత్స‌వ‌ వేడుకలలో భాగ్యసాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర, మోటార్ సైకిల్ లతో ర్యాలీ నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో 75 మొక్కలు నాటాలని సూచించారు. ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలన్నారు. దేశంలో నిరుద్యోగ, పేదరిక సమస్య నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నామ‌ని.. ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలి.. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News