ప్రసవానికి 60 లక్షలు.. రెయిన్ బో నిర్వాకం

హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం పేరుతో రోగి బంధువుల నుంచి 60 లక్షలు వసూలు చేశారు

Update: 2022-06-23 05:01 GMT

హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం పేరుతో రోగి బంధువుల నుంచి 60 లక్షలు వసూలు చేశారు. 60 లక్షలు చెల్లించినా తమ చిన్నారులు మాత్రం మిగలలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో ఏప్రిల్ 24వ తేదీన సువర్ణ ప్రసవం కోసం చేరారు. పన్నెండు రోజుల తర్వాత సువర్ణ కవలలకు జన్మించింది. ఒక పాప, ఒక బాబు పుట్టారు.

ఇద్దరూ చనిపోయి....
అయితే మూడు రోజులకే పాప చనిపోయింది. ఆ పాప చికిత్స ఖర్చు కోసం 19.90 లక్షలు యాజమాన్యం వసూలు చేసింది. తర్వాత చికిత్స పొందుతూ మరో బాబు కూడా మరణించారు. బాబు చికిత్స కోసం 33.16 లక్షలు వసూలు చేశారు. అయితే సువర్ణ, రఘునాధరెడ్డిల నుంచి మొత్తం 60 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆసుపత్రి బిల్లులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రెయిన్ బో ఆసుపత్రిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News