హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం

గోల్ద్ ఏటీఎంను తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాదు చేశారు. నగదు మాదిరిగానే బంగారాన్ని ఈ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు.

Update: 2022-12-04 05:34 GMT

గోల్ద్ ఏటీఎంను తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాదు చేశారు. నగదు మాదిరిగానే బంగారాన్ని ఈ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఈ ఏటీఎంను తెలంగాణ మహిళ సంఘం ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను ప్రారంభించారు.

త్వరలో మరిన్ని ఏటీఎంలు...
ఈ ఏటీఎం నుంచి 05, , 1, 2, 5,10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఈ బంగారానికి 99.99 శాతం శుద్ధత కలిగి ఉంటుందని తెలిపారు. ఈ తరహా ఏటీఎంలను త్వరలోనే గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్ తో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్ లలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏ రోజు కారోజు బంగారం ధరల ప్రకారం డబ్బును పెట్టి అంత బంగారాన్ని డ్రా చేసుకునే వీలును ఈ ఏటీఎంలో కల్పించారు.


Tags:    

Similar News