నగర శివారులో నగ్నంగా జంట మృతదేహాలు.. కలకలం

యువతీ, యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2022-05-03 14:30 GMT

others

రంజాన్ పండుగ వేళ హైదరాబాద్ నగర శివారులో దారుణ ఘటన వెలుగుచూసింది. చెట్ల పొదల్లో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుల జంట మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం బ్రిడ్జి వద్ద ఇద్దరినీ దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతులను వారాసిగూడకి చెందిన యశ్వంత్(22), వివాహిత(28)గా గుర్తించారు. సంఘటన స్థలం వద్ద పడి ఉన్న బైక్, బ్యాగు ఆధారంగా మృతులను గుర్తించినట్లు తెలుస్తోంది.

యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి అతి కిరాతకంగా హతమార్చారు. వివాహిత ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని రాయితో కొట్టినట్లు తెలుస్తోంది. వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. వివాహిత భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చెట్ల పొదల్లో ఇద్దరి మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం తీవ్ర అలజడి రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్పాట్‌లో ఆధారాలు సేకరించారు. అక్కడ పడి ఉన్న బైక్ నంబర్ ఆధారంగా యశ్వంత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించనట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీసీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News