కాల్పుల కేసు : నిందితుల కోసం గాలింపు

హైదరాబాద్ లో జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించే పనిలోపడ్డారు. దుండగులు రెక్కీ పక్కాగా నిర్వహించారని భావిస్తున్నారు.

Update: 2022-12-02 03:39 GMT

హైదరాబాద్ నగరంలో జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించే పనిలోపడ్డారు. దుండగులు రెక్కీ పక్కాగా నిర్వహించి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. నాగోల్ లోని స్నేహపురి కాలనీలోని మహదేవ్ జ్యుయలర్స్ లో ఇద్దరు దొంగలు చొరబడి కాల్పులు జరిపారు. బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సందర్భంగా నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెక్కీ జరిపి...
సికింద్రాబాద్ నుంచి ఫాలో అవుతూ వచ్చి దుకాణంలోకి రాగానే షాపులోకి చొరబడి షట్టర్ మూసి దొంగలు బెదిరించారు. షాపు యజమాని, వర్కర్ పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలను బట్టి దుండగులు ఎటు వెళ్లారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పుల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News