కొడుకును చంపేశారు.. బైక్ దాచేశారు.. ఆ తల్లిదండ్రులు ఎందుకిలా చేశారు..?

మే 6వ తేదీ ఉదయం, బాధితురాలి తల్లి కరమ్‌వతి పైకరా (40), వారి ఇంటికి సమీపంలోని లక్రా టోక్రి రోడ్డులో తన కుమారుడి..

Update: 2023-05-19 05:22 GMT

chhattisgarh crime news

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ వ్యక్తి తన 18 ఏళ్ల కుమారుడిని హత్య చేసి శవాన్ని, మోటార్‌సైకిల్‌ను రోడ్డు పక్కన పడేసి ప్రమాదం జరిగి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహదపాని గ్రామానికి చెందిన కుహ్రు సింగర్ కుమారుడు 18 ఏళ్ల టెక్మణి పైకర మృతదేహం మే 5న లక్రా టోక్రి రోడ్డులో కనిపించింది. బైక్ ప్రమాదంలో టెక్మణి మరణించినట్లు బాధితుడి మేనమామ మే 6న పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక వాంగ్మూలాలలో "11వ తరగతి చదువుతున్న టెక్మణి హాస్టల్ నుండి ఇంటికి తిరిగి వచ్చి మేనమామ బైక్‌పై తన ఇంటి నుండి బయలుదేరినట్లు పేర్కొన్నారు.

మే 6వ తేదీ ఉదయం, బాధితురాలి తల్లి కరమ్‌వతి పైకరా (40), వారి ఇంటికి సమీపంలోని లక్రా టోక్రి రోడ్డులో తన కుమారుడి మృతదేహాన్ని కనుగొన్నారు" అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టంలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయని బయటపడింది. అతడిని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారనే అనుమానంతో, లైలుంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఇంటిలో అనేక ప్రదేశాలలో కొత్తగా పెయింట్ వేసినట్లు కనుగొన్నారు. ఇంటి ప్రాంగణంలో రక్తపు మరకలు కూడా కనుగొన్నారు. మనుషుల రక్తమని ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్ధారించింది.
టెక్మణి తల్లిదండ్రులను విచారించగా.. నేరం అంగీకరించారు. కొడుకు తమ మాట వినలేదని, జల్సాలకు అలవాటు పడి.. చదువుకోనని చెబుతుండడంతో క్షణికావేశంలో కొట్టినట్లు తండ్రి అంగీకరించాడని అధికారి తెలిపారు. ఆ దెబ్బలకు యువకుడు చనిపోయాడు. టెక్మణి మే 5న చనిపోయాడు. హత్యను దాచిపెట్టే ప్రయత్నంలో తల్లిదండ్రులు మృతదేహాన్ని, మోటార్‌సైకిల్‌ను రోడ్డు పక్కన పడేశారు. హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, ఇతర నేరాలకు వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.


Tags:    

Similar News