నవవధువుమృతి కేసులో ట్విస్ట్.. ఆ ట్యాబ్లెట్ వల్ల చనిపోయిందా ?

పెళ్లివస్త్రాల్లో కూతుర్ని చూసి.. ఆ తల్లిదండ్రులు కార్చిన ఆనంద భాష్పాలు.. కన్నీళ్లుగా మిగిలాయి. జీలకర్ర బెల్లం..

Update: 2022-05-13 09:45 GMT

విశాఖ : విశాఖపట్నం మధురవాడలో కోటిఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టాల్సిన పెళ్లికూతురు సృజనకు పెళ్లిపీటలపైనే నిండునూరేళ్లు నిండిపోయాయి. పెళ్లివస్త్రాల్లో కూతుర్ని చూసి.. ఆ తల్లిదండ్రులు కార్చిన ఆనంద భాష్పాలు.. కన్నీళ్లుగా మిగిలాయి. జీలకర్ర బెల్లం పెట్టేసమయంలో పెళ్లిపీటలపైనే కుప్పకూలిన సృజన.. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి మృతి చెందడం.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఇరు కుటుంబాలను ప్రశ్నించగా.. ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి ఇష్టపడే చేసుకుంటుందని చెప్పారు.

మరోవైపు.. సృజన హ్యాండ్ బాగ్ లో గన్నేరు పప్పు వంటి పదార్థం లభించడంతో.. పెళ్లికి ముందు ఆమె ఆ పప్పును తినిందా ? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. పెళ్లికొచ్చిన బంధువులు మరో విషయం చెప్పారు. పెళ్లికి నెలసరి అడ్డురాకుండా.. సృజన తల్లిదండ్రులు ఓ ట్యాబ్లెట్ ఇచ్చారని, అది వికటించి సృజన చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా బుధవారం సాయంత్రం అట్టహాసంగా జరగాల్సిన పెళ్లి విషాదాంతమైంది. అసలు సృజన మృతికి గల కారణాలు తెలియాలంటే.. పోస్టుమార్టం రిపోర్టు రావాల్సిందే.




Tags:    

Similar News