నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం.. ఇంతలో రెచ్చిపోయిన దుండగులు

నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం.. ఇంతలో రెచ్చిపోయిన దుండగులు

Update: 2022-08-03 06:07 GMT

సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడుపల్లి ఎస్సై వినయ్‌ కుమార్ తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎస్సైపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఎస్సై వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని గీత నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. కడుపు భాగంలో నాలుగు, వెన్నులో నాలుగు కుట్లు వేశారు. ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఓంశాంతి టిఫిన్ సెంటర్ ఎదురుగా నైట్‌ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్‌, మరో పోలీస్‌ అధికారి సత్యనారాయణతో కలిసి తనిఖీలు నిర్వహిన్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు నంబరు ప్లేట్ లేకుండా మోటారు సైకిల్‌తో వస్తుండం చూసి వారిని ఆపారు. ఇద్దరిని విచారిస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్‌ఐ వినయ్ కుమార్‌పై దాడి చేశాడు. కడుపు, వెన్ను భాగంలో పొడిచాడు. అనంతరం ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను లంగర్‌హౌస్‌లోని సంజయ్‌ నగర్‌లో నివాసముండే పవన్‌, సంజయ్‌గా గుర్తించారు. వారిని పాత నేరస్తులుగా గుర్తించారు.

నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారని.. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగులు దాడికి పాల్పడ్డారని అక్కడ ఉన్న వ్యక్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News