చెరకు పాలు తీసే యంత్రంలో బురఖా ఇరుక్కుని మహిళ మృతి

చెరకు పాలు తీసే యంత్రంలో బురఖా ఇరుక్కుని మహిళ మృతి

Update: 2022-07-06 15:28 GMT

చెరకు పాలు వచ్చే యంత్రానికి బురఖా చిక్కుకుని ఓ మహిళ మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో చోటుచేసుకుంది. కోలార్ జిల్లా కేజీఎఫ్ నగర్ రాబర్ట్‌సన్ టౌన్ 3వ క్రాస్ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌసర్ బేగ్ అనే మహిళ మృతి చెందింది. ఆమె వయసు 37 సంవత్సరాలు. మంగళవారం తెల్లవారుజామున కౌసర్ బేగ్ చెరకు పాలు అమ్మే దుకాణానికి వచ్చింది. ఈ సమయంలో ఆమె వేసుకున్న బురఖా చెరకు యంత్రంలో చిక్కుకుంది. వెంటనే ఆమెను కూడా ఆ మెషీన్ లాగేసింది. ఆమెను ఇతరులు రక్షించేలోపే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాబర్ట్‌సన్‌ టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News