మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై ఈ ఫిర్యాదు చేశారు.

Update: 2022-01-18 04:29 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై ఈ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని ఆధ్వర్యంలోనే గుడివాడకు గోవా కల్చర్ తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో సంక్రాంతి పండగకు పెద్దయెత్తున అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు.

500 కోట్లు...
ఈ కేసినో నిర్వహణ ద్వారా 500 కోట్లు చేతులు మారాయని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేవిధంగా వ్యవహరించిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.


Tags:    

Similar News