55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు రైళ్ల రద్దును పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

Update: 2022-01-25 03:43 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు రైళ్ల రద్దును పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ రైళ్ల రద్దను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 24వ తేదీ వరకూ పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజుతో గడువు పూర్తి కావడంతో ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రైళ్ల రద్దును పొడిగించింది.

ఈ సర్వీసులను....
సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కలబుర్గి, చెన్నై వంటి స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చిత్తూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - చిత్తూరు, కాజేపట్ - సికింద్రాబాద్, హైదరాబాద్ - కాజీపేట్ ల మధ్య నడిచే పలు రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.


Tags:    

Similar News