Chandrababu : ఏడాది పాలన ఏమి ఇచ్చింది? ఏం తెచ్చింది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి నేటికి ఏడాది కావస్తుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి నేటికి ఏడాది కావస్తుంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తో పాటు దాదాపు ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నేటికి ప్రభుత్వం పాలనచేపట్టి ఏడాది పూర్తి కావస్తుంది. చంద్రబాబు నాయుడు మాత్రం ఏడుపదుల వయసు దాటనా ఏమాత్రం తగ్గలేదు. ఆయన గతంలో మాదిరిగా 18 గంటలు నిర్విరామంగా పనిచేయకపోతున్నప్పటికీ ఆయన పనితీరులో ఏమాత్రం రాజీపడటం లేదు. గత ఏడాది నుంచి ఆయన చేస్తున్న పర్యటనలు, చేస్తున్న సమీక్షలను చూస్తుంటే ఆయనను చూసి నేటితరం రాజకీయ నేతలు ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ టు విజయవాడ ఎన్ని సార్లు తిరిగారంటే అది రాష్ట్ర అభివృద్ధికోసమే. పది రూపాయలు ప్రయోజనం రాష్ట్రానికి ఉందంటే ఆయన ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. ఏడాది కాలంలో దాదాపు పది సార్లకు మించి ఢిల్లీకి వెళ్లి వచ్చారంటే ఆయన లో ఉన్న తపన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు. గతంలో పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తాజాగా ఏడాది పూర్తి చేసుకున్నారు.