Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.

Update: 2025-09-13 11:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఉదయం హోంమంత్రి, డీజీపీలతో సమావేశం అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల కాన్ఫరెన్స్ ఉండటంతో తాజాగా ఐపీఎస్ ల బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం పథ్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు నియమితులయ్యారు. మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బదిలీలయిన జిల్లాల ఎస్సీలు వీరే

బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ - రాహుల్‌ మీనా.
బాపట్ల జిల్లా - ఉమామహేశ్వర్‌
నెల్లూరు - అజితా వేజెండ్ల.
తిరుపతి - సుబ్బారాయుడు.
అన్నమయ్య - ధీరజ్‌ కునుగిలి.
కడప - నచికేత్‌.
నంద్యాల - సునీల్‌ షెరాన్‌.
విజయనగరం - ఏ.ఆర్‌.దామోదర్‌.
కృష్ణా జిల్లా - విద్యాసాగర్‌ నాయుడు.
గుంటూరు - వకుల్‌ జిందాల్‌.
పల్నాడు జిల్లా - డి.కృష్ణారావు.
ప్రకాశం జిల్లా - హర్షవర్థన్‌ రాజు.
చిత్తూరు జిల్లా - తుషార్‌ డూడి.
శ్రీ సత్యసాయి - సతీష్‌కుమార్‌


Tags:    

Similar News