Chandrababu : రేపు వేమూరు నియోజకవర్గానికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు

Update: 2026-04-08 04:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేుపు వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు.

టీడీపీ కార్యకర్తలతో...
సూరేపల్లిలో పంట పొలాలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. వేమూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకోనున్నారు.


Tags:    

Similar News