మీరు త్వరగా కోలుకోవాలి చంద్రబాబు గారు - సీఎం వైఎస్ జగన్

చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మీరు త్వరగా

Update: 2022-01-18 06:55 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా.. చంద్రబాబుకు కరోనా సోకడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

మీరు త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులవ్వాలని కోరుకుంటున్నానంటూ.. చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు జగన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడికన్నా ముందు.. కొడుకు నారా లోకేష్ కు పాజిటివ్ గా తేలింది. ఇప్పుడు చంద్రబాబు కు కూడా పాజిటివ్ గా నిర్థారణ అవ్వడంతో..ఇద్దరూ ఇంట్లోనే ఐసోలేట్ అయి, చికిత్స తీసుకుంటున్నారు.







Tags:    

Similar News