TDP : టీడీపీకి సీఐడీ నోటీసులు జారీ.. ఆ కోట్ల రూపాయలు ఎక్కడివి?

ఏపీ సీఐడీ టీడీపీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న టీడీపీ నేత అశోక్ బాబుకు ఈ నోటీసులు అందచేశారు

Update: 2023-11-14 11:55 GMT

ఆంధ్రప్రదేశ్ సీఐడీ తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న టీడీపీ నేత అశోక్ బాబుకు ఈ నోటీసులు అందచేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది.

ఈ నెల 18న...
ఈ నెల 18వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయానికి వచ్చి 27 కోట్లకు సంబంధించిన వివరాలను అందచేయాలని నోటీసుల్లో పేర్కొంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో పెద్దయెత్తున నగదు చేతులు మారిందని సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉండి అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News