ఏపీలో పెట్టుబడి పెట్టండి... దావోస్ లో నారా లోకేష్
ఈవై ఇండియా సిఇఓ, రాజీవ్ మెమానితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు.
ఈవై ఇండియా సిఇఓ, రాజీవ్ మెమానితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఐటి పూల్ కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ఎఐ, డీప్ టెక్ పరిశోధనలపై దృష్టిసారించామన్నారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో ఐటి నిపుణులు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతిలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐటిరంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో బ్యాకెండ్ ఐటి కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే అక్కడఉన్న బలమైన మౌలిక సదుపాయాల ప్రయోజనాన్ని మీరు పొందే అవకాశముందని పేర్కొన్నారు. వివిధ రకాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న ఎపిలో స్థానిక విశ్వవిద్యాలయాలు, సంస్థల భాగస్వామ్యంతో ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో నైపుణ్యాభివృద్ధికి ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయమని ఆహ్వానించారు.