ఏపీలో సగానికి సగం తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా సగానికి సగం తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 5,879 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా సగానికి సగం తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 5,879 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,76,370 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,615 మంది మరణించారు. అయితే పరీక్షల సంఖ్య తక్కువగా ఉంది. కేవలం 25,284 మందికి మాత్రమే పరీక్షలు జరిపారు.
అనంతపురం జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,51,238 గా ఉంది. 1,10,517 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,24,70,712 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా అనంతపురం జిల్లాలో 856 కరోనా కేసులు నమోదయ్యాయి