ఏపీ కరోనా అప్ డేట్

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2022-02-14 12:02 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదు వందల కేసులకు తక్కువగా నమోదవ్వడం చాలా రోజుల తర్వాత తొలిసారి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 23,13,212 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,697 మంది మరణించారు.

పరీక్షల సంఖ్య...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,83,788 గా ఉంది. 14,726 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,28,46,978 నమూనాలను పరీక్షించారు. ఈరోజు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 108 కేసులు నమోదయ్యాయి. అయితే పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం కూడా కేసులు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ఈరోజు 15,193 మంది శాంపిల్స్ ను మాత్రమే పరీక్షించింది.


Tags:    

Similar News