ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 6,213 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 6,213 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,82,583 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,620 మంది మరణించారు. అయితే పరీక్షల సంఖ్య తక్కువగా ఉంది. కేవలం 25,284 మందికి మాత్రమే పరీక్షలు జరిపారు.
కృష్ణా జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,62,033 గా ఉంది. 1,05,930 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,25,05,747 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కరోనా కేసులు నమోదయ్యాయి