IPl 2024 : నేటి ఐపీఎల్ మ్యాచ్.. మజా చేసేయండి

నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ పోటీ పడనుంది

Update: 2024-03-29 02:23 GMT

నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ పోటీ పడనుంది. బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఊపు మీద ఉంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలని భావిస్తుంది.

బెంగళూరులోనే కావడంతో...
అయితే సొంత మైదానంలో బెంగళూరు జట్టును ఓడించడం అంత సులువు కాదేమోనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని బెంగళూరు జట్టు భావిస్తుంది. ఐపీఎల్ కావడంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. చివరకు విజేత ఎవరు అనేది తేలాలంటే చివరి ఓవర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News