IPL 2024 : నేడు మరో కీలక మ్యాచ్

నేడు పంజాబ్ కింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది

Update: 2024-04-09 03:29 GMT

నేడు ఐపీఎల్ లో మరో ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఛండీగడ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు అన్ని ఫార్మాట్లలో బలంగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా కూడా ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ గెలుపోటములపై అనేక రకాలుగా అంచనాలు వినిపిస్తున్నాయి.

రెండు జట్లు...
పంజాబ్ కింగ్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది. సన్ రైజర్స్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాంటి మేటి జట్లను ఓడించి బాగా కసిమీదుంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నువ్వా? నేనా అన్న రీతిలో తలపడనున్నాయి. ఇరుజట్లు స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది.


Tags:    

Similar News