IPL 2024 : నేడు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్

ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది

Update: 2024-03-25 03:11 GMT

ఐపీఎల్ మ్యాచ్ లు ఈ నెల 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఓడిపోవడంతో కసి మీదున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పోరాడుతుంది.

ఇరు జట్లు...
అలాగే పంజాబ్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై గెలిచి ఊపు మీదుంది. దీంతో ఇరు జట్లు పోటా పోటీగా ఈ తలపడనున్నాయి. బెంగళూరు స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరు జట్లు కొన్ని మార్పులు, చేర్పులతో బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టిక్కెట్‌లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బెంగళూరులో గెలుపు ఎవరిదన్న దానిపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News