IPL 2024 : దంచికొట్టిన ఢిల్లీ

ఢిల్లీ కాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Update: 2024-04-27 12:12 GMT

ఢిల్లీ కాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు నష్టపోయింది. జేక్ ఫ్రేజర్ మరోసారి రెచ్చిపోయాడు. ఇరవై ఏడు బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు ఫోర్లు, ఆరు సిక్సర్లున్నాయి.

భారీ లక్ష్యం...
ట్రిస్టన్ స్టబ్స్ 48 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 36 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా తనవంతు చేసిన ప్రయత్నంతో అత్యధిక స్కోరు ఢిల్లీ కాపిటల్స్ చేసింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్ దీనిని అధిగమించేందుకు కసరత్తులు చేయాాల్సి ఉంటుంది.


Tags:    

Similar News