IPl 2024 : నేడు దిగ్గజ టీంల మధ్య మ్యాచ్

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో నేడు బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది

Update: 2024-04-11 03:26 GMT

ఐపీఎల్ లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో నేడు బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ముంబయి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లకు ఈ మ్యాచ్ లో గెలుపు అవసరం ఎక్కువగా ఉంది.

రెండు జట్లు...
ముంబయి జట్టు ఇప్పటి వరకూ ఒక మ్యాచ్ లో గెలిచింది. అలాగే బెంగళూరు జట్టు కూడా అదే పరిస్థితుల్లో ఉంది. రెండు జట్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందన్నది అంచనాలకు అందకుండా ఉంది. సొంత మైదానం కావడంతో తమకు అనుకూలమని ముంబయి ఇండియన్స్ అంటుండగా, తాము గెలిచి తీరతామాని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు పట్టుదలతో ఉంది.


Tags:    

Similar News