Ukrain War : భారత్ కు చేరుకున్న ఆరో విమానం

కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Update: 2022-02-28 13:45 GMT

కేంద్ర ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఐదు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. తాజాగా ఆరో విమానం బూడాపెస్ట్ నుంచి భారతీయులతో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో 240 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటి వరకూ ఆరు విమానాల్లో 1,396 మందిని తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మూడోసారి మోదీ....
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారత్ ఈ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. తాజాగా మోదీ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు కూడా వెళ్లారు. ఆపరేషన్ గంగా పేరిట ఈ మిషన్ ను చేపట్టింది. తాజాగా మోదీ మరోసారి హైలెవెల్ మీటింగ్ లో పాల్గొన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో మోదీ మూడోసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారీతీయుల భద్రత, వారిని తీసుకొచ్చే అంశంపైనే చర్చిస్తున్నారు.


Tags:    

Similar News