Ukranine Crisis : నేడు భారత్ కు మూడో విమానం

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో విమానం ఢిల్లీకి రానుంది.

Update: 2022-02-27 02:12 GMT

ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో విమానం ఢిల్లీకి రానుంది. బూర్ కాస్ట్ నుంచి నేడు మరో విమానం రానుంది. ఈ విమానంలో దాదాపు 240 మంది విద్యార్థులు భారత్ కు చేరుకుంటారని తెలిసింది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమయిన నేపథ్యంలో ఆ దేశ సరిహద్దు దేశాల నుంచి భారత్ విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేసింది.

రెండు విమానాల్లో...
ఇప్పటికే రెండు విమానాలు భారత్ కు చేరుకున్నాయి. ఈ రెండు విమానాల్లో 469 మంది విద్యార్థులు భారత్ కు చేరుకున్నారు. నేడు మూడో విమానం కూడా రానుంది. మొత్తం 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారని వారందరినీ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News