సెమీస్ లాగానే : అద్భుతాన్ని సాధ్యం చేసిన పీవీ సింధు

Update: 2016-11-20 16:50 GMT

ఒలింపిక్ పతకాన్ని సాదించి.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడంతో ఆమె ప్రస్థానం ఆగిపోలేదు. అక్కడినుంచి మరింత ఇనుమడించిన పట్టుదలతో సాధన చేసింది. అందుకే పీవీ సింధు ఇవాళ చైనా సూపర్ సిరీస్ ను గెలుచుకోగలిగింది. ‘‘ఇది ఎన్నో రోజుల కల .. చెప్పడానికి మాటలు రావడం లేదు... అంటూ సింధు విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.

చైనా క్రీడాకారిణి సున్ యూతో జరిగిన సూపర్ సిరీస్ టోర్నీ తుది పోరాటంలో పీవీ సింధు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అచ్చం సెమీస్ లాగానే ఒక సెట్ ను కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కోలుకుని తన ఆటలో పదును చూపించింది. 21-11, 17-21, 21-11 తేడాతో సింధు విజయం సాధించడం విశేషం.

సింధు విజయం పట్ల దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

Similar News