వైసీపీ వెంట 20 పార్టీలు

Update: 2018-03-16 06:54 GMT

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికితాము పూర్తి మద్దతిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. తాము వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వనున్నటు చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ వెంట ఉన్న 20 పార్టీలూ అవిశ్వాసానికి మద్దతిస్తాయని, ఈ మేరకు లోక్ సభలోని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సోనియా ఆదేశాలు జారీ చేశారని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రఘువీరారెడ్డి వెల్లడించారు.

Similar News