వర్మపై ఫిర్యాదు....

Update: 2017-04-12 12:03 GMT

రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మాతగా రాంగోపాల్‌ వర్మ నిర్మించిన "వంగవీటి" చిత్రంపై మాజీ ఎమ్మెల్యే., వైసీపీ ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ న్యాయపోరాటం ప్రారంభించారు. దర్శక., నిర్మాతలు హైకోర్టుకు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మించారని., వంగవీటి కుటుంబీకులను రౌడీలుగా చిత్రీకరించడంతో పాటు తన తల్లి వంగవీటి రత్నకుమారి హత్యలను ప్రోత్సహించినట్లుగా చిత్రంలో చూపడాన్ని రాధాకృష్ణ తప్పు పట్టారు. చిత్రం విడుదలకు ముందే హైకోర్టును తాము ఆశ్రయించామని అప్పట్లో అభ్యంతరకరమైన డైలాగులు.., దృశ్యాలను ఉంచమని దర్శక., నిర్మాతలు హామీ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. వంగవీటి చిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అంతా కొత్ర పాత్రధారులతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు తగ్గ మాస్‌ మసాలా లేకపోవడం వాస్తవ కథకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేదు. చిత్రం విడుదలైన తర్వాత కూడా దర్శకుడు రాంగోపాల్ వర్మ., వంగవీటి రాధాకృష్ణల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. వివాదం సద్దుమణిగిందనుకున్న సమయానికి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించడంతో ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Similar News