మళ్లీ జనంలోకి జగన్

Update: 2017-11-11 00:30 GMT

జగన్ పాదయాత్ర ఐదోరోజు ప్రారంభం కాబోతోంది. ఎర్రకుంట్ల నుంచి ప్రారంభమయ్యే యాత్ర దాదాపు 16 కిలోమీటర్ల మేరకు సాగనుంది. గురువారం రాత్రి ఎర్రకుంట్ల వరకూ పాదయాత్ర చేసిన జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో స్వల్ప విరామమిచ్చి రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ సాయంత్రం వరకూ కోర్టులోనే ఉన్నారు. సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేయడంతో రాత్రికి రాత్రే జగన్ ఎర్రకుంట్లకు కు బయలుదేరి వచ్చారు.

ఈరోజు ఎర్రకుంట్ల నుంచి....

జగన్ పాదయాత్ర గురువారం ఆగిన ఎర్రకుంట్ల నుంచే బయలుదేరుతుంది. జగన్ దాదాపు ఏడునెలల పాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉండటంతో వారంలో ఒకరోజు పాదయాత్రకు జగన్ విరామివ్వక తప్పదు. కోర్టుకు పాదయాత్రలో ఉన్నానని విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ వారంలో ఒకరోజు మాత్రమే కదా? అని న్యాయస్థానం వ్యాఖ్యానించడంతో తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితి జగన్ ది. దీంతో తిరిగి ఈరోజు జగన్ ఎర్రకుంట్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ జగన్ దాదాపు 46 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఈరోజు మరో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాత్రి హైదరాబాద్ నుంచి రావడంతో కొంత ఆలస్యంగా పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశముందని వైసీపీ వర్గాలు చెప్పాయి.

Similar News