మరో 20 ఏళ్ల పాటు అధికారం మాదే: హరీష్

Update: 2016-04-09 22:52 GMT

నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మరో ఇరవైఏళ్లపాటు టీఆర్‌ఎస్‌దే అధికారమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.1024 కోట్ల వ్యయంతో గిడ్డంగులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈనెల 27 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను ఇతర రాష్ర్టాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. చనిపోయిన టీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తోన్నామని పేర్కొన్నారు.

Similar News