బ్రేకింగ్ : బాబుకు అమిత్ షా ఫోన్

Update: 2018-02-04 07:35 GMT

కీలక సమావేశం నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితులు, బడ్జెట్ కేటాయింపులపై అమిత్ షా చంద్రబాబుతో చర్చించారు. చంద్రబాబు అమిత్ షా తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన ఎంపీల సమావేశానికి వచ్చారు. అయితే అమిత్ షా తో మాత్రం ఏపీకి బడ్జెట్ లో అన్యాయం జరిగిందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. అయితే దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇంకా టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఎంపీలయితే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. సమావేశంలో చంద్రబాబు ఒక్కక్కరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

Similar News