బోండా ఉమకు బాబు ఝలక్...!

Update: 2018-01-31 11:25 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పై సీరియస్ అయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుల స్థలాన్ని బోండాఉమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి కబ్జాచేశారని ఆరో్పణలు వచ్చాయి. ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలం ఆక్రమణల విషయంలోనూ బోండా ఉమ హస్తం ఉందన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో బోండా ఉమ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ వివాదాల్లో తనకు ఎటువంటి ప్రమేయం లేదని బోండా ఉమ చంద్రబాబుకు వివరించబోయారు. అయితే అవేమీ విన్పించుకోకుండా రాజకీయాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అధికారం ఉంది కదా? అని ఇటువంటిపనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే చంద్రబాబు బెజవాడలో భూవివాదంపై ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతానని, వాస్తవమని తేలితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి ఘాటుగానే హెచ్చరించినట్లుసమాచారం. దీంతో చేసేది లేక ఉమ వెనుదిరిగినట్లు తెలుస్తోంది.

Similar News