బెంగళూరు జైలులో శశికళ

Update: 2017-02-15 12:30 GMT

బెంగళూరు జైలుకు శశికళ చేరుకున్నారు. పరప్పణ అగ్రహారం జైలు వద్దకు కొద్దిసేపటి క్రితం శశికళ చేరుకున్నారు. జైలు వద్దే ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేయడంతో ఆమె కోర్టుకు వెళ్లే పనిలేకుండా పోయింది. దీంతో శశికళ నేరుగా బెంగళూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.

ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో చెన్నైలో బయలుదేరిన శశికళ దాదాపు ఐదున్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు జైలు అధికారులు తొలుత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు జైలులో గదిని కేటాయించనున్నారు. శశికళ దరఖాస్తును పరిశీలిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. తనకు మినరల్ వాటర్, ఏసీ గది, వ్యక్తిగత సహాయకుడితో పాటు రోజు ఇంటి నుంచి భోజనం కావాలని శశికళ జైలు అధికారులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని జైలు అధికారులు చెప్పారు. బెంగళూరు జైలు వద్దకు అన్నా డీఎంకే అభిమానులు పెద్దయెత్తున తరలి వచ్చారు.

Similar News