పవన్ స్పందించారు.. అంతే : కొత్త సంగతుల్లేవ్

Update: 2016-11-20 22:00 GMT

దాదాపు 12 రోజులుగా ప్రజలు నోట్ల విషయంలో నానా కష్టాలు పడుతోంటే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. కేంద్రం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదంటూ, జాగ్రత్తలు పాటించలేదంటూ విమర్శించారు. ఆయన తన ట్విటర్ అకౌంటర్ ద్వారా ఈ స్పందనను తెలియజేశారు.

ఈ రద్దు వలన పరిణామాల విషయంలో పవన్ వెల్లడించిన కొత్త సంగలు, అభిప్రాయాలు, సలహాలు ఏమీలేకపోవడం విశేషం. ఇన్ని రోజులుగా అందరూ చెబుతున్న మాటలనే ఇవాళ పవన్ క్రోడీకరించి ట్విటర్ లో పెట్టినట్లుగా ఈ కామెంట్లు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News